సిరా న్యూస్, ఆదిలాబాద్
24 నుండి సోయాబీన్ కొనుగోలు ప్రారంభం
* పిఎసిఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి
రైతుల వద్ద నుండి మళ్లీ సోయాబీన్ పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీసీసీబీ డైరెక్టర్, జైనథ్ పిఎసిఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్వింటాలుకు రూ 4,600/- చొప్పున సోయా బీన్ కొనుగోలు చేయడానికి సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను ఈనెల 24 నుండి నుండి మార్చ్ 5వ తేదీ వరకు తెరవడానికి అనుమతించిన్నట్లు తెలిపారు. దీంతో జిల్లా అదనపు కలెక్టర్, మార్క్ఫెడ్ అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.