బీఆర్ఎస్ లో తీవ్ర విషాదం

సిరా న్యూస్,హైదరాబాద్;
బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (33) మృతి చెందారు. పటాన్ చెరు సమీపంలో ఓఆరైర్పై ఆమె ప్రయాణిస్తోన్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడిక్కకడే మృతి చెందారు. ఆమె కారు డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో లాస్య నందిత కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. కాగా, ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్య నందిత. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న అనారోగ్యంతో కన్నుమూయగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత కంటోన్మెంట్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గద్దర్ కూతురు వెన్నెలపై 17,169 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *