సిరా న్యూస్,హైదరాబాద్;
కంటోన్మెంట్ ఎం ఎం ఏ లాస్య నందిత శుక్రవారం రోడ్డు ప్రమాదం లో మరణించడం పట్ల సికింద్రాబాద్ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె మృతి తీవ్ర బాధాకరమని పేర్కొన్నారు. చిన్న వయసులోనే నందిత ను కోల్పోవడం విచారకరమని పేర్కొన్నారు. కంటోన్మెంట్ ఎం ఎల్ ఏ దివంగత సాయన్న కుమార్తె గా లాస్య నందిత ప్రజల్లో ముద్ర వేసుకున్నారని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.