హుజూరాబాద్ లో మంత్రి పొన్నం పర్యటన

సిరా న్యూస్,కరీంనగర్;
హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. అయన స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. తరువాత మంత్రి వీణవంక మండల కేంద్రంలో సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దర్శనం చేసుకున్నాం. అమ్మవార్ల ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. రాబోయే కాలంలో సమృద్ధిగా వర్షాలు పడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవార్లను ప్రార్థించానని అన్నారు,.
అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియంతృత్వం కి వ్యతిరేకంగా ప్రజా పాలన ఏర్పడింది. ఈ ప్రజా పాలన కొంత మంది 70 రోజులు కాకముందే ప్రగల్బాలు పలుకుతున్నరు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ప్రభుత్వం కూలిపోతుందని ఒకడు కులగొడతామని ఒకడు..నీటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయా ప్రభుత్వాలు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ కి చేసింది ఏముంది. మమ్మల్ని ప్రశ్నించే ముందు దళిత ముఖ్యమంత్రి ,డబుల్ బెడ్రూం ,నిరుద్యోగ భృతి అమలు చేశారా. నియంత్రుత్వంతో స్వేచ్ఛ లేకుండా ప్రశ్నించే గొంతు లేకుండా బతికేటువంటి పరిస్థితి లేకుండే. మా ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం ముళ్ళ కంచెలు బద్దలు కొట్టాం. ప్రజలందరికీ ఉపయోగంలో ఉండే విధంగా మా పరిపాలన కొనసాగిస్తున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *