సిరా న్యూస్, ఆదిలాబాద్
ఎమ్మెల్యే మృతి బీఆర్ ఎస్ పార్టీకి తీరని లోటు
* మాజీ మంత్రి జోగు రామన్న
* నివాళులర్పించిన బీఆర్ ఎస్ నాయకులు
బి ఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం బి ఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆమె మృతి పట్ల శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. అనంతరం శ్రద్ధాంజలి ఘటించి, ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు.ఐదు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈసందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ… అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పొందిన ఆమె ఘన విజయాన్ని సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. పలుమార్లు విషాద సంఘటలకు గురి అయిన ధైర్యంగా ఎదుర్కొన్న ఆమె స్ఫూర్తిని మరువలేమని తెలిపారు. నేడు అకాల మరణంతో యావత్తు తెలంగాణ రాష్ట్రమంతట తీవ్ర దిగ్బాంతని వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు. ఈ విషాదఛాయల నుండి ఆమె కుటుంబం త్వరగా కోలుకోవాలని అన్నారు. కార్యక్రమంలో విజ్జగిరి నారాయణ, రోకండ్ల రమేష్, మహిళా అధ్యక్షులు స్వరూప రాణి, కరుణ, మాజీ మార్కెట్ చైర్మన్ కొముర రాజు, ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, అశోక్ స్వామి, సంధ్య నర్సింగ్, శ్రీనివాస్, కొండ గణేష్, భరత్, దమ్మాపాల్ కార్యకర్తలు పాల్గొన్నారు.