కినుక వహించిన పిల్లి సత్యనారాయణ మూర్తి
కాకినాడ రూరల్;
కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి భర్త రాష్ట్ర టిడిపి కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న కాకినాడ రూరల్ లో మిత్రపక్షం జనసేన ఏకపక్షంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిందని అయన అన్నారు. టికెట్ కేటాయించకుండానే పార్టీ కార్యాలయం ప్రారంభించారు. నా భార్య మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి నేను వెనుకబడిన వర్గానికి చెందిన వారం. టిడిపి ఆవిర్భావం నుండి టిడిపి ఒకప్పుడు సెంటర్ నియోజకవర్గం, ఇప్పుడు కాకినాడ రూరల్ బిసి లకు కేటాయిస్తుంది. ఇప్పుడు 2024ఎన్నికల పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ జనసేన కు కేటాయిస్తారనే సమాచారం మాకు ఉందని అన్నారు.
పొత్తులో భాగంగా టికెట్ ఎవరికిచ్చినా అందరం కలిసి పనిచేస్తాం. పార్టీ ఆదేశాలు మాకు శిరోధార్యం. టికెట్ కేటాయించకుండానే మిత్రపక్షం వారు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం టికెట్ మాకే వచ్చేసింది అని చెప్పుకోవడంతో మా బిసి నాయకులు కొంతమంది మీడియా సమావేశం నిర్వహించారు. నాకు కాకినాడ రూరల్ టికెట్ ఇవ్వరని నాకు తెలుసు. నిన్న మా నాయకులు జనసేన కు టికెట్ ఇస్తే మేము సపోర్ట్ చేయము అని చెప్పినందుకు వారితరపున నేను క్షమాపణ చెబుతున్నాను. కొంతమంది మీడియా మిత్రులు రెచ్చగొట్టడం వలనే మా నాయకులు ఆ విధంగా మాట్లాడారు. పిల్లి సత్యనారాయణ మూర్తి పార్టీ మారిపోతాడని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా వెనకాల కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి వారు నాకు టికెట్ రానివ్వరు అదినాకు తెలుసు. నా ఊపిరి ఉన్నంతకాలం టిడిపి జెండా మోస్తానని వివరణ ఇచ్చారు.