సిరా న్యూస్,నల్గోండ;
అసెంబ్లీలో గత ప్రభుత్వాలు చేసిన అవినీతి అక్రమ ప్రాజెక్టులపై ప్రజా గొంతుకై ప్రతిపక్షం ని నిలదీస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చీకటి గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హోమం చేశారు కాంగ్రెస్ నాయకులు. 2023 స్థానిక ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించిన నాటి నుండి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా తనదైన శైలిలో వివిధ శాఖల అధికారుల సమీక్ష సమావేశాలు నిర్వహించారని అన్నారు.. పల్లెల్లో బెల్ట్ షాపుల నిర్వహణలో యువత మద్యానికి బానిసలే అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో రోడ్డున పడుతున్నారని తెలిసిన వెంటనే ప్రతి పల్లెల్లో బెల్ట్ షాపులు నిర్మూలన చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్నారని నల్గొండ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కోమటిరెడ్డి బ్రదర్స్కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారని రాష్ట్ర అభివృద్ధి కొరకు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు..