వైకాపా కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్రెడ్డి, కోడుమూరు నియోజవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్
సిరా న్యూస్,కొడుమూరు;
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న వలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, వలంటీర్ల సేవలు అసమానమని వైఎస్ఆర్సీపీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్రెడ్డి, ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ పేర్కొన్నారు. కర్నూలు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం వలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించి ఉత్తమ వలంటీర్లను ఘనంగా సత్కరించారు. ఎంపీపీ వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 372 మంది వాలంటరీలను సన్మానించి, మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కోట్ల హర్షవర్ధన్రెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను ఇంటింటికీ అందజేయడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారు చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది వలంటీర్లకు అభినందన కార్యక్రమం నిర్వహిస్తోందని తెలిపారు. ప్రభుత్వం వలంటీర్లకు గతం కంటే ప్రోత్సాహకాలను పెంచిందని, సేవా వజ్ర కింద రూ.45 వేల నగదు, సేవా రత్న నగదు రూ.30 వేలు చొప్పున, సేవా మిత్ర పురస్కారం కింద రూ.15 వేల చొప్పున బహుమతి ప్రదానం చేస్తున్నామని తెలిపారు.వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు చేస్తున్న నిస్వార్థ సేవలను గుర్తించి, వారి సేవలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ పురస్కారం అందిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థలో వలంటీర్లు చాలా బలమైన పాత్ర పోషిస్తున్నారన్నారు. వలంటీర్లను సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర, అవార్డులతో సన్మానించడం సంతోషదాయకమని అన్నారు. పేదవారి గుండెల్లో గుడి కట్టుకున్న ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. మళ్లీ సంక్షేమ ప్రభుత్వం అధికారంలోకి రావాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేష్ నాయుడు, జడ్పిటిసి ప్రసన్న కుమార్, వైస్ ఎంపీపీ నేహమియా, ఉల్చాల సర్పంచ్ విద్యాసాగర్, ఎంపీటీసీ రామ్నాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పంచలింగాల వెంకటేశ్వర రెడ్డి, సింగవరం వెంకటేశ్వర్ రెడ్డి, ఉల్చాల వాసు, సంపత్ కుమార్, నిడ్జుర్ ప్రసాద్, నిడ్జూర్ సంపత్ కుమార్, పడిదంపాడు వెంకటేశ్వర్లు, తాండ్రపాడు చిన్న లక్ష్మన్న, సురేష్, మిలిటరీ కాలనీ వెంకటేశ్వర్లు, పుడూరు మహేష్, ఆదాము, భాస్కర్, శివరామపురం శివన్న, అనుకు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.