సిరా న్యూస్,నెల్లూరు;
సూళ్లూరుపేట శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య తల్లి కిలివేటి మస్థానమ్మ బుధవారం కాలం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర మేయర్ దంపతులు స్రవంతి జయవర్ధన్ లు సూళ్లూరుపేటలోని ఎమ్మెల్యే సంజీవయ్య గృహాన్ని శుక్రవారం సందర్శించారు. మస్థానమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కిలివేటి సంజీవయ్య కుటుంబానికి మేయర్ దంపతులు ప్రగాడ సానుభూతిని తెలిపారు.