సిరాన్యూస్,నెల్లూరు;
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రెడ్డిపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుజ్జమ్మ ఇంట్లో విగత జీవిగా పడి ఉంది. గత కొంతకాలంగా బుజ్జమ్మ ఒంటరిగా నివాసం ఉంటుంది. మూడు రోజులుగా ఆమె కనపడటం లేదని గ్రామస్తులు భావించారు. ఆమె ఇంటి పక్కన వ వారికి వాసన వస్తుండడంతో వారు అనుమానంతో బుజ్జమ్మ ఇంటికి వెళ్లి చూడగా ఆమె చనిపోయి పడి ఉంది. దీంతో ఆమె కొడుకులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. ఇంట్లో బీరువా పగలగొట్టి ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎఎస్పి , డి.ఎస్.పి వీరాంజనేయరెడ్డి, బుచ్చి సీఐ హైమారావు, డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.