సిరాన్యూస్,పత్తికొండ;
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల కు తొలి జాబితాను టిడిపి, జనసేన అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా కేఈ శ్యాంబాబు ను నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలో నాలుగు స్తంభాల కూడలి దగ్గర టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా టిడిపి కార్యకర్తలు కేఈ శ్యాంబాబు నాయకత్వం వర్ధిల్లాలంటూ పత్తికొండకు కాబోయే టిడిపి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.