సిరాన్యూస్, అదిలాబాద్ రూరల్
బీఆర్ ఎస్ హయంలోనే ఆలయాల నిర్మాణానికి పెద్దపీట
* మాజీ మంత్రి జోగు రామన్న
* ఘనంగా హీరాసుక జయంతి వేడుకలు
* వీర బ్రహ్మేంద్రస్వామి విగ్రహ ఆవిష్కరణ
ఆలయాల నిర్మాణానికి గత బి ఆర్ ఎస్ ఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందనీ మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం అదిలాబాద్ రూరల్ మండలం వాన్ వాట్ గ్రామంలో హీరాసుక జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొని హీరాసుక దేవుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కచ్కంటి గ్రామంలో వీర బ్రహ్మేంద్రస్వామి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈసందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాలకు ప్రత్యేక ప్రాధాన్యతను కల్పిస్తూ నిర్మాణాలను చేపట్టి గ్రామంలోని ఐక్యతను చాటిందన్నారు. ఆదివాసిలా సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ నేటి తరాలకు కూడా స్ఫూర్తినిచ్చేలా గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహాన్ని అందించింది అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గండ్రత్ రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ కుమ్రా రాజు, మాజీ ఎంపీపీ సేవ్వా జెగదీష్, ఎంపిటిసి బుచ్చన్న , శుక్లాల్, సర్పంచుల సంఘం అధ్యక్షులు ఉషన్న, తదితరులు పాల్గొన్నారు.