BGR: కొనుగోలు కేంద్రాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి

సిరాన్యూస్‌, జైన‌థ్‌
కొనుగోలు కేంద్రాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి
* నాణ్యమైన పంటను తీసుకువచ్చి మద్దతు ధర పొందాలి
* పిఎసిఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి
* సోయాబీన్ కొనుగోలు ప్రారంభం
ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల‌ను రైతులు స‌ద్వినియోగం చేసుకోవాలని పిఎసిఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. జైనథ్ వ్యవసాయ సహకార సంఘంలో ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా తూకం కాంటాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంత‌రం మార్కెట్ యార్డుకు తొలి పంటను తీసుకువచ్చిన రైతును సన్మానించి కొనుగోళ్ళను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన సోయాబీన్ పంటను మార్కెఫెడ్ సంస్థ ద్వారా కొనుగోలు చేసేందుకు ఆదిలాబాద్ జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశార‌ని తెలిపారు. మార్కెఫెడ్ సంస్థ ద్వారా పంటను మార్చ్ 5వ తేదీ వరకు కొనుగోలు చేస్తున్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మద్దత్తు ధర క్వింటాలు కు 4,600 రూపాయలను చెల్లించడం జరుగుతుందని తెలిపారు. నాణ్యమైన పంటను తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. పంట కొనుగోలుకు సహకరించిన అదనపు కలెక్టర్, ఎమ్మెల్యే, మార్క్ఫెడ్ అధికారులు ఆయన ప్రత్యక్ష కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మార్కెట్ కమిటీ అధికారి మధుకర్, రైతు లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *