సిరాన్యూస్, బోథ్
రైతులకు నష్ట పరిహారం అందజేత
అటవీ జంతువులు వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందజేశారు. చిరుతపులి దాడిలో ఆవులను కోల్పోయిన రైతులకు శనివారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రము లోని అటవీ శాఖ కార్యాలయంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు నష్టపరిహారం చెక్కులు అందజేశారు. గుట్ట పక్క తండా గ్రామ రైతు చవాన్ గణేష్ కు రూ.18వేలు, చింతలబోరి గ్రామ రైతు చవాన్ సోమ్నాథ కు రూ.10వేలు అందజేశారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు ప్రమోద్, డిప్యూటీ ఆర్ ఓ వినోద్, ఎఫ్. బి. ఓ పరశురామ్, జూనియర్ అసిస్టెంట్ జాబిర్ పాల్గొన్నారు.