సిరా న్యూస్,కాకినాడ;
టిడిపి జన సేన పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా నీ ప్రకటించారు. దీంతో జనసేన నాయకులు జనసైనికులు పంతం నానాజీ ఇంటి వద్ద సంబరాలు చేశారు. కాకినాడ రూరల్ వలసపాకాల గంగరాజు నగర్ లో జనసేన రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో పంతం నానాజి నీ జనసేన నాయకులు కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా జన సేన నాయకులు జన సైనికులు వెన్నంటి ఉండి ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేశామన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన , అక్రమ అరెస్ట్ లు చేసిన ఎక్కడ బెదరకుండా ప్రజా సమస్యలపై గొంతు విప్పి పోరాటం చేశామన్నారు. అదే రీతిలో ప్రజల మధ్యకు వెళ్లి రాబోయే ప్రభుత్వం లో తమ సమస్యలు పరిష్కార దిశగా కృషి చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతమన్నారు.