గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ తోనే సాధ్యం

సిరా న్యూస్,సి.బెళగల్;
మండలంలోని ముడుమాల గ్రామంలో ఆర్ అండ్ బీ నిధులు రూ.32 కోట్ల వ్యయంతో సి. బెళగల్ మండలంలోని కొత్తకోట గ్రామం నుంచి తిమ్మందొడ్డి గ్రామం వరకు (17 కిలోమీటర్ల మేర) నిర్మించనున్న ఆర్ అండ్ బీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన కుడా ఛైర్మన్ – కోట్ల హర్షవర్థన్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇంచార్జి – డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొంతల మునెప్ప, కర్నూలు జెడ్పీటీసీ – ప్రసన్న, గూడూరు జెడ్పీటీసీ – మౌలాలి, నార్వ నాగేశ్వరరెడ్డి, రవి రెడ్డి, వైస్ ఎంపీపీ నాయకంటి మంగమ్మ, గ్రామ సర్పంచ్ బతుకమ్మ, టీజీ వెంకటేష్ మండల నాయకులతో కలిసి పూజ నిర్వహించారు. అనంతరం వారు పనులను ప్రారంభించారు.కొత్తకోట నుంచి సి . బెలగల్ రావాలంటే నరకం వుండేదని ప్రజల కష్టాలు గుర్తించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోడ్ పనులు తొందరగా చేపట్టి ప్రజలకు కష్టాలు తీర్చారని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.సందర్భంగా గ్రామానికి వచ్చిన నేతలకు గ్రామ, మండల ప్రజలు, నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఘన స్వాగతం పలికారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *