Dr. Soumya Mishra: జైల్‌లో పెట్రోల్ పంప్ ఏర్పాటు చేయడం సంతోషకరం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
జైల్‌లో పెట్రోల్ పంప్ ఏర్పాటు చేయడం సంతోషకరం
* రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా మిశ్రా
ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా జైలు ఆవరణలో భారత్ పెట్రోలియం వారి సహాకారంతో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంప్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ తో కలిసి రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా మిశ్రా, ఐపియస్ శనివారం ఉదయం ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జైలు నందు పెట్రోల్ పంప్ ఏర్పాటు చేయడం సంతోషకరమని, ఇది రాష్ట్ర జైళ్ల శాఖలో ఏర్పాటు చేయబడిన 30వ పెట్రోల్ పంపు అని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఖైదీలకు ఉపాది కల్పించడమే కాకుండా వారు జైలు నుండి విడుదలైన అనంతరం పెట్రోల్ పంప్ లలో ఉద్యోగాలు ఇస్తున్నామని తద్వారా వారు నేరప్రవృత్తికి దూరంగా ఉండేలా కృషిచేస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యతతో కూడిన ఇంధనాన్ని అందించేందుకు, ఖైదీలకు జీవనోపాధి కల్పించేందుకు పెట్రోల్ బంక్ ను ప్రారంభించుకున్నామని ఆన్నారు.ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో నేరాలు మరింత తగ్గి జిల్లా ప్రశాంతంగా మారుతుందని, అదేవిధంగా జిల్లా జైలుకు తమ నుండి పూర్తి సహాకారం అందిస్తామని తెలిపారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ యన్. మురళి బాబు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జైళ్ల శాఖ నడుపుతున్న పెట్రోల్ పంపుల యందు నాణ్యమైన పెట్రోల్ పూర్తి ఖచ్చితమైన కొలమానంలో అమ్మబడుతుందని, అందువల్లనే రాష్ట్రంలో ప్రతియేటా బెస్ట్ పెట్రోల్ పంపులుగా ఎన్నికవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జైళ్ల శాఖ డిప్యూటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ యం. సంపత్, అదనపు యస్.పి., బి.పి.సి.యల్. అధికారులు, జిల్లా జైలు పర్యవేక్షనాధికారి పి. అశోక్ కుమార్, జైలు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *