Anuraga: ఎనీమియా రహిత సమాజానికి పాటుపడాలి

సిరా న్యూస్, చిగురుమామిడి
ఎనీమియా రహిత సమాజానికి పాటుపడాలి
* హుజురాబాద్ టీమ్ ఏ మెడికల్ ఆఫీసర్ అనురాగ
* రాష్ట్రీయ బాల్‌ స్వా స్త్య కార్యక్రమం
* నలుగురుని ఎనీమియా విద్యార్థులుగా గుర్తింపు
ఎనీమియా రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని బాల్‌ స్వా స్త్య కార్యక్రమం హుజురాబాద్ టీమ్ ఏ మెడికల్ ఆఫీసర్ అనురాగ సూచించారు. సోమ‌వారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమియా ముక్త్ భారత్ స్కీం లో భాగంగా రాష్ట్రీయబాల్‌ స్వా స్త్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కె)హుజురాబాద్ టీ ఏ వైద్య సిబ్బంది 8వ తరగతి నుండి 10 వ చదువుతున్న బాల బాలికలకు, హిమోగ్లోబిన్ టెస్ట్, వైద్య పరీక్షలు నిర్వహించారు. నలుగురుని ఎనీమియా విద్యార్థులుగా గుర్తించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల రక్తంలో హెచ్‌బీ శాతం పెంపొందాలంటే రాగి జావా, ఖర్జూర,ఆకూకురలు, బెప్పాయి పండ్లు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలో అధిక శాతం మంది విద్యార్థులు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మణరావు, ఉపాధ్యాయులు కానుగంటి రాజమౌళి, శ్యామల, జోష్ణ, శంకర్ ప్రతిమ, వైద్య సిబ్బంది ఫార్మసిస్ట్ శ్వేతారెడ్డి, ఏఎన్ఎం శారద,పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *