Sharmila Reddy: అనంత‌పురంలో కాంగ్రెస్ న్యాయ సాధ‌న స‌భ‌

సిరా న్యూస్, కళ్యాణదుర్గం
అనంత‌పురంలో కాంగ్రెస్ న్యాయ సాధ‌న స‌భ‌
* హాజ‌రు కానున్న ఏఐసీసీ అధ్య‌క్షుడు ఖ‌ర్గే
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. సోమ‌వారం అనంత‌పురం పట్టణంలోని న్యూ టౌన్ జూనియర్ కాలేజి గ్రౌండ్లో సాయంత్రం 4 గంటలకు సభన్యాయ సాధ‌న పేరుతో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వహిస్తోంది. ఈ స‌భ‌కు ముఖ్య అతిథులుగా  ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి,ఇతర రాష్ట్ర ముఖ్యనేతలు  పాల్లొన‌నున్నారు. ఈ స‌భ‌లో కొన్ని కీలకమైన ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స‌భ ద్వార పార్టీ శ్రేణుల్లో మ‌రింత ఉత్స‌హాన్ని నింపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *