Suhasini Reddy:సనాతన‌ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది

సిరా న్యూస్, జైన‌థ్‌
సనాతన‌ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది
* బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి
* లక్ష్మిపూర్ లో రామాలయం ప్రారంభోత్సవం
సనాతన‌ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని లక్ష్మిపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా వేద పండితుల సమక్షంలో గ్రామస్తులు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు . ఈసంద‌ర్భంగా ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *