సిరా న్యూస్, చిగురుమామిడి
ప్రజల ఆకాంక్షల మేరకే ఆరు గ్యారంటిల అమలు
* మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి
తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని చిగురుమామిడి మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీలో భాగంగా గృహా జ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు 500 లకే ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకాలు ఈ నెల 27 రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రియాంకగాంధీ చేతుల మీదగా ప్రారంభం కాబోతుందని తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పి ఫ్లేర్ లీడర్ గీకురు రవీందర్, చిట్టిమళ్ల రవీందర్, దాసరి ప్రవీణ్ కుమార్ నేత తదితరులు పాల్గొన్నారు.