Joguramanna: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

సిరా న్యూస్, జైన‌థ్‌
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
* మాజీ మంత్రి జోగురామన్న
* లక్ష్మీపూర్లో  శ్రీ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన
ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ మానసికంగా ప్రశాంత జీవనాన్ని గడపాలని మాజీ మంత్రి జోగురామన్న సూచించారు. జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన మాజీ మంత్రికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రామాలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను పురస్కరించుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా జరపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వేడుకలను నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. శ్రీ రాముడి కృపా కటాక్షలతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ సైతం ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆయనను నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, సర్పంచ్ దాసరి లక్ష్మి రాములు, నేతలు అడప తిరుపతి, విజ్జగిరి నారాయణ, కుమ్ర రాజు, ఆవుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *