సిరా న్యూస్, భీమదేవరపల్లి
ఏసీపీని కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ ను సోమవారం భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఇటీవల హుజురాబాద్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ ను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ విశిష్ట సేవలందించాలని కోరారు. కాగా శ్రీనివాస్ ఎల్కతుర్తి సీఐగా రెండు సంవత్సరాలు సేవలందించాడు.ఈ కార్యక్రమంలో ఊసకోల ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.