హుస్నాబాద్ లో మంత్రి పొన్నంపర్యటన

 సిరా న్యూస్,సిద్దిపేట;
హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. రేపటి నుండి 500 కే గ్యాస్ పథకం అమలవుతుండడంతొ మహిళలతో కలిసి గ్యాస్ సిలిండర్ కి పూలు వేసి శుభాకాంక్షలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేసారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ స్కీముల్లో భాగంగా మహిళలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాన్ని , 200 సునీట్ల ఉచిత విద్యుత్ పథకం కార్యక్రమం లాంఛనంగా మా నాయకురాలు ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి, మంత్రులందరం కలిసి ప్రారంభిస్తున్నామని అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాగ్దానాలు అన్ని నెరవేరుస్తున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజాస్వామ్య పద్ధతి లో చేసుకోవాలి. మేము ఇచ్చిన హామీలు వంద రోజులు కూడా పూర్తికాకముందే ప్రేరేపితమైన మాటలు ప్రభుత్వాలు కూలగొడతామనే మాటలు మాట్లాడుతూ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఆది మంచి పద్ధతి కాదు. మేము ఎన్నికల్లో చెప్పిన విధంగా ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ రవాణా సౌకర్యం , ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినం. ఈరోజు మహిళలకు 500 రూపాయల కే సిలిండర్ అందిస్తుండడం మహిళల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని అన్నారు.మహిళలు వారి కార్యక్రమాలను విస్తృతపరచుకుంటున్నారు. మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. దేవాలయాలకు, హాస్పిటలకు ఉచితంగా స్వేచ్ఛగా వెళ్తున్నారు. ప్రజా చైతన్య యాత్ర చేస్తున్న బండి సంజయ్ ని అడుగుతున్నానని అన్నారు మీ ప్రభుత్వం 500 కే సిలిండర్ ఇవ్వగలుగుతుందా…? 500 సిలిండర్ 1200 కు పెంచారు మీరు ఏం జవాబు చెబుతారు..? కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ చెప్పాలి. 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న మాట్లాడకుండా ఎన్నికలు వస్తున్నాయని రామాలయం పేరు మీద ఓట్లు అడిగితే కాదు. మతపరమైన అంశాలతో ఓట్లు అడగడం కాదు, ప్రజాస్వామ్యతంగా ఓట్లు అడగాలి. తెలంగాణకు బిజెపి ఏం చేసిందో చెప్పాలి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడిగా ఏం కొట్లాడారు. తెలంగాణ అక్కచెల్లెళ్లకు శుభాకాంక్షలు చెబుతున్న. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బిజెపి ప్రజాహితం పేరిట యాత్రలు చేస్తోందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *