ముగిసిన టీటీడీ పాలకమండలి భేటీ

పలు కీలక తీర్మానాలకు ఆమోదం
 సిరా న్యూస్,తిరుమల;
తిరుమల అన్నమయ్య భవన్ లో ముగిసిన టిటిడి పాలక మండలి సమావేశం జరిగింది. పాలకమండలి తీర్మానలపై టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ డక దారిలోని గాలిగోపురం, ఆంజన్న విగ్రం, మోకాలిమెట్టు దగ్గర నిత్య సంకీర్తనార్చ, 1.69 కోట్లతో శ్రీవారి ఆలయంలో జయ విజయుల విగ్రహాల బంగారు తాపడం పనులకు ఆమోదం,
తిరుపతి ఆవిర్భావ దినోత్సవ (ఫిబ్రవరి 24) వేడుకలను ప్రతి ఏడాది నిర్వహణ, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో 3 కోట్లతో లైటింగ్ ఏర్పాటు, సప్తగిరి వసతి గదులు 1,4 బ్లాకుల ఆధునిఖీకరణకు 3.11 కోట్లకు ఆమోదం, శ్రీలంకలోని కొలంబోలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ప్రణాళిక, టీటీడీ కాంట్రాక్టు, సొసైటీ ఉద్యోగులకు 15 వేల మందికి జీతాల పెంపు 3 నుండి 20వేల వరకు జీతాలు పెంచుతూ టీటీడీ బోర్డు తీర్మానం చేసింది
టీటీడీ లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు తిరుమల ఎంప్లాఈస్ క్యాంటీన్ లో అల్పాహారం, భోజనం అందించడానికి భూమన కరుణాకర రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *