సిరా న్యూస్, జైనథ్:
లక్ష్మీపూర్లో జడ్పిటీసి దంపతుల పూజలు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయంలో జైనథ్ జడ్పిటీసీ తుమ్మల అరుంధతి వెంకట్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ రాములోరి నూతన విగ్రహాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు జడ్పిటీసీ దంపతులు తుమ్మల అరుంధతి వెంకట్ రెడ్డిలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జడ్పిటీసీ తుమ్మల అరుంధతి మాట్లాడుతూ… గ్రామస్తులంత ఐక్యతతో గ్రామంలో రామాలయం నిర్మించుకోవడం సంతోషకరమన్నారు. అధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత సాధ్యమని, ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకోవాలన్నారు.