Lakkimshetty Pullarao: లక్కింశెట్టి పుల్లారావు మరణం పార్టీకి తీరని లోటు

 సిరా న్యూస్,మైలవరం;
మైలవరం మండలం చండ్రగూడెం తెలుగుదేశం పార్టీ నేత లక్కింశెట్టి పుల్లారావు కు మాజీ మంత్రి దేవినేని ఉమా నివాళులర్పించారు. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పుల్లారావు భౌతిక కాయానికి నివాళులర్పించి, మైలవరంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. దేవినేని మాట్లాడుతూ దశాబ్దాలుగా పుల్లారావు పార్టీ కోసం అనేక సేవలు అందించారు ఆయన మరణం పార్టీకి తీరని లోటు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు చేతులెత్తి నమస్కరిస్తున్న దయచేసి భావోద్వేగాలకు గురికావద్దని అన్నారు.
బ్లూ మీడియా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలను నమ్మవద్దు. కొంతమంది స్వార్థపరులు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం వలన పుల్లారావు మానసిక ఆందోళనకు గురై మన మధ్య లేకుండా పోయారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *