సిరా న్యూస్ కళ్యాణదుర్గం
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
* టీడీపీ అధినేత చంద్రబాబు
* వినతి పత్రం అందించిన జర్నలిస్టులు
* ఏపి చంద్రబాబుతో ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధుల భేటీ
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీయూడబ్ల్యూజే (ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై చంద్రబాబుకు వినతిపత్రం అందించారు. అందులోని అంశాలను మేనిఫెస్టోలో అంశాలను పొందుపర్చాలని కోరారు.
జర్నలిస్టుల సంఘం ప్రతినిధుల సమస్యలను విన్న చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలను మళ్లీ ప్రవేశపెడతామని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఉచిత వాతావరణం కల్పిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి సోమ సుందర్, చావా రవి తదితరులు పాల్గొన్నారు.