Congress:ఎంపీ బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలి

సిరా న్యూస్, చిగురుమామిడి
ఎంపీ బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలి
* హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు
* పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపి బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కార్యక్రమంలో బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాతృమూర్తిపై అనుచిత వాక్యాలు చేశారని వెంటనే క్షమాపణలు చెప్పాలని  హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు అన్నారు. సోమవారం రాత్రి బండి సంజయ్ పై కేసు నమోదు చేయాలని హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల సమీప పోలిస్ స్టేషన్ లో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల కోసం అందరికీ ఆరాధ్యుడైన శ్రీరాముడిని తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకునే ఏకైక స్వార్ధ జీవులు బిజెపి నాయకులు ప్రజా ప్రతినిధులుగా ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు తాను చేసిన అభివృద్ధిని చెప్పుకునే పరిస్థితి లేదన్నారు. ప్రజా ప్రతినిదిగా తన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు ఏమి లేవని కాబట్టే అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకులపై బురదజల్లే కార్యక్రమం చేపట్టారన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినారన్నారు .కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏ రోజు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ దేవుళ్ళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. శ్రీరాముడు అందరివాడు అన్నాడని, కన్న తల్లుల పట్ల మనిషి అనే వాడు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ బండి సంజయ్ రాజకీయ లబ్ధి పొందాలని చూడటం తన అవివేకానికి నిదర్శన‌మ‌న్నారు. కార్యక్రమంలో టిపిసిసి మెంబర్ తీయడం లింగమూర్తి , సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు, కాంగ్రెస్ నాయకులు చిత్తారి రవీందర్, వడ్డేపల్లి వెంకటరమణ, పెరుమాండ్ల నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *