Congress: బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం

సిరా న్యూస్, చిగురుమామిడి
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం
* పోటాపోటీగా ఇరు పార్టీ కార్యకర్తల నినాదాలు
* ప్రజాహిత యాత్రలో గంద‌ర‌గోళం
* ర‌హ‌దారిపై కాంగ్రెస్ నాయ‌కుల రాస్తారోకో.. బండి సంజ‌య్ దిష్టిబొమ్మ ద‌హ‌నం
* కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో మలి విడత ప్రజా హిత యాత్రలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి హుస్నాబాద్ శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. సోమవారం రాత్రి బసచేసిన చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి స్కూల్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించి బండి సంజయ్ దిష్టిబొమ్మ ను ద‌హ‌నం చేశారు.దీంతో ఉద్రిక్తత నెలకొంది.పోటీగా బిజెపి కార్యకర్తలు పొన్న ప్రభాకర్ డౌన్లోడ్ నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి చిగురుమామిడి సైదాపూర్ హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లలకు తరలించారు. బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ తాను ఎవరిని కించపరిచేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. తాను తప్పుగా మాట్లాడినట్టు భావిస్తే కేసు పెట్టిన లీగల్ గా చర్యలు తీసుకోవద్దని వెల్లడించారు.ప్రజాహిత యాత్రను అడ్డుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని… ప్రజాహిత యాత్రను తప్పకుండా కొనసాగిస్తామని ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని తెలిపారు.చిగురుమామిడి మండలం దాటి హుస్నాబాద్ మండలం రాములపల్లికి యాత్ర బయలుదేరింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజాహిత యాత్ర పొన్నం ప్రభాకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకుంటున్న దృష్ట పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ భద్రతా చర్యలు చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *