సిరాన్యూస్, చిగురుమామిడి
ఎవరిని కించపర్చెలా మాట్లాడలేదు..
* యాత్రను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు
* ఎంపీ బండి సంజయ్
తాను ఎవరిని కించపర్చెలా మాట్లాడలేదని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ప్రజాహిత యాత్రపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ప్రజాహిత యాత్ర ను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.శాంతియుతంగా చేస్తున్న యాత్రను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.తాను తప్పుగా మాట్లాడినట్లు భావిస్తే కేసు పెట్టి లీగల్ గా చర్యలు తీసుకోవచ్చని వెల్లడించారు.దీంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగనుంది.ఇంటెలిజెన్స్ సమాచారం తో పోలీసులు అప్రమత్తమయ్యారు.