సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని అమృత హాస్పిటల్ లో గర్భిణి మృతి చెందింది. మృతురాలు సిర్గాపూర్ మండల కేంద్రానికి చెందిన ప్రియాంక(21). ప్రియాంక గత 8 రోజుల నుండి అమృత ఆసుపత్రి చికిత్స పొందుతోంది. రెండు రోజుల క్రితం ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అమృత ఆసుపత్రి డాక్టర్లు హైదరాబాద్ కు రిఫర్ చేసారు. హైదరాబాద్ ప్రవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. అమృత ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం తోనే ప్రియాంక మృతి చెందినట్టు కుటుంబీకులు ఆరోపించారు. ఆసుపత్రి ముందు ప్రియాంక కుటింబికులు ఆందోళనకు దిగారు.