సిరా న్యూస్, హైదరాబాద్
మోడీని మూడోసారి ప్రధాని చేయాలి
* ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
* కొనసాగుతున్న విజయ సంకల్ప యాత్ర
మోడీని మూడోసారి ప్రధాని చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం విజయ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుండి భాగ్యలక్ష్మి. క్లస్టర్ లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి , ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపి ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను గురించి వివరించారు.