సిరా న్యూస్, కుందుర్పి
టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నాయకులు
వైసీపీ కార్యకర్తలు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో టీడీపీ లోకి చేరారు. అనంతపురం నగరం లో కళ్యాణదుర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుస్వగృహంలో బుధవారం కంబదూరు మండలం నుండి వైకాపాకు చెందిన 13కుటుంబాల కార్యకర్తలు టిడిపి కండువా కప్పుకుని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన వారందరికీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వనించారు.