సిరా న్యూస్,ఉయ్యూరు;
ఉయ్యూరు పట్టణ టిడ్కో లబ్ధిదారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి ,నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త జోగి రమేష్ పాల్గోన్నారు.
వచ్చే జూలై మాసం లోపు ఇళ్ళ నిర్మాణాలకు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జులై నెల ఆఖరి లోపు ఉయ్యురు లో ఉన్న లబ్ధిదారులైన నా అక్కచెల్లమ్మలకు టిడ్కో ఇల్లు పూర్తి చేసి ఇస్తాము. ఒక 10రోజుల లో ప్రభుత్వం ఇవ్వవలసిన సబ్సిడీ అమౌంట్ ను అనర్హుల యొక్క డిపాజిట్ అమౌంట్ లను రిఫండ్ చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ నియోజకవర్గనికి సమన్వయకర్తగా నన్ను నియమించి కొన్ని రోజులు మాత్రమే అయ్యింది అయినా కూడా మీ సమస్య ను గుర్తించి అధికారుల తో కలిసి పరిష్కరించాలని ఇక్కడికి వచ్చాను. రాష్ట్రం లో పలు చోట్ల టిడ్కో ఇళ్ళు పూర్తి చేసి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ శాసనసభ్యులు అక్కచెల్లమ్మలకు న్యాయం చేయలేకపోయారు. కానీ నేను మాట ఇస్తున్న ఖచ్చితంగా మీకు పట్టు వస్త్రాలతో నూతన గృహప్రవేశం చేయించి జై జగన్ అనిపించే బాధ్యత నాది. మీ బాధలు, వ్యధలు అన్ని నేను తెలుసుకున్న బ్యాంకు వాళ్ళు లోన్ అమౌంట్ ను మీ ఖాతా లోనుండి కట్ చేసుకోకుండా జిల్లా కలెక్టర్ గారిచే ఆదేశాలు ఇవ్వబోతున్నామని అన్నారు.
మీరు మీ సొంత ఇళ్లలోకి వెళ్లే వరకు ఎటువంటి లోన్ కట్టనవసరం లేదు. ఇంకా ఏ సమస్యలు ఉన్న అక్కచెల్లమ్మలు నా దగ్గరకు వచ్చి చెప్పండి వీలైనంత వరకు సమస్యలు పరిష్కరించి మీకు సమాధానాలు ఇస్తాను. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి రాజబాబు , టిడ్కో ఎండి శ్రీధర్ రెడ్డి. *రాష్ట్ర యువ నాయకులు జోగి రాజీవ్ తో పాటు హౌసింగ్ ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.