సిరా న్యూస్, కళ్యాణదుర్గం
గెలుపే లక్ష్యంగా పని చేయాలి
* ఎంపీ తలారి రంగయ్య
* మేము సిద్ధం…మా బూత్ సిద్ధం కార్యక్రమం
రానున్న ఎన్నికలు మన ముందున్న లక్ష్యమని, ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని అనంతపురం జిల్లా పార్లమెంట్ సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయా కర్త, డా. తలారి రంగయ్య అన్నారు. మంగళవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ‘మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం’ పేరుతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసన సభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు వేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి కుందుర్పి మండలం, వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్, శ్రీ, సత్యనారాయణ శాస్త్రి, మండల జేసీఎస్ కన్వీనర్, ఈ రాము పాల్గొన్నారు