సిరా న్యూస్,వికారాబాద్;
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తయి అని వికారాబాద్ జిల్లా తాండూరు కస్టోడియన్స్ మళ్లినాథ్, కృష్ణయ్య పేర్కొన్నారు. బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కావడంతో మంగళవారం తాండూరు కస్టోడియన్స్ మళ్లినాథ్, కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ ఆదేశాలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాలలోకి అనుమతి ఉండదని అన్నారు. తాండూరు పట్టణంలో 8 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని మొదటి, రెండవ సంవత్సర గాను మొత్తం 4500 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లుగా తెలిపారు. ఈ సంవత్సరం పరీక్ష రాసే విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని వెల్లడించారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాలలో ఏ ఒక్క అధికారికి కూడా సెల్ ఫోన్ ఎలక్ట్రానికల్ వస్తువులు అనుమతి లేదు అని తెలిపారు. ప్రతిరోజు 2000 పైచిలుకగా విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నట్లుగా తెలిపారు. ఇందుకోసం పోలీస్ శాఖ అధికారులు కూడా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పర్యవేక్షణ ఉంటుందని,అదేవిధంగా ఈసారి ప్రతి పరీక్ష కేంద్రానికి ఉన్నతస్థాయి అధికారులైన ఎమ్మార్వోల పర్యవేక్షణ అధికారులుగా నియమించడం జరిగిందని తెలిపారు. సాధ్యమైనంత వరకు విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగానే హాజరుకావాలని తెలిపారు. సరియైన సమయానికి ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రశ్న పత్రాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే సమయంలో ఏ ఒక్క విద్యార్థిని కూడా బయటికి అనుమతించని నిబంధన ఈసారి ఉందని తెలిపారు. సమయం ముగిసిన తర్వాతనే విద్యార్థులను బయటికి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఇంగ్లీష్ పరీక్ష లో విద్యార్థులు మొదటి సంవత్సర విద్యార్థులు తమ పరీక్ష పత్రాన్ని పరిశీలించుకోవాలని ఈసారి ప్రాక్టికల్ ఉండడంతో 80 మార్కులతో కూడిన ప్రశ్న పత్రం వస్తుందని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి భయాలు లేకుండా పరీక్షలు వ్రాయాలని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు