సిరా న్యూస్,విశాఖపట్నం;
మంత్రి గుడివాడ అమర్నాథ్పై పాయకరావుపేట టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత మండిపడ్డారు.విశాఖ మీడియా సమావేశంలో కోడి గుడ్డు పగులగొట్టి ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి తన నియోజకవర్గానికి వచ్చి కొడతానంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒక్కొక్కరికి గుడ్డు పగులుద్దని వార్నింగ్ ఇచ్చారు. కాగా.. జగన్, భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిగెత్తించి కొడతానని మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు.