జగనన్న ఆరోగ్య సురక్షను సద్వినియోగం చేసుకోండి

సిరా న్యూస్,నందికొట్కూరు;
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు మనోజ్ కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దామ గట్ల గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ద్వారా పేద ప్రజల చెంతకే వైద్యం అందుతుందని అన్నారు. అనంతరం గ్రామంలోని 410 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రహీమ్, వైద్యుల అనిల్ కుమార్, రాజశేఖర్, వాలంటరీలు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *