సిరా న్యూస్, జైనథ్
బట్టి విధానానికి స్వస్తి పలకాలి
* జిల్లా విద్యాధికారి ప్రణిత
విద్యార్థులు బట్టి విధానానికి స్వస్తి పలకాలని జిల్లా విద్యాధికారి ప్రణిత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మేడిగూడ రోడ్ జిల్లా పరిషత్ పాఠశాలను జిల్లా విద్యాధికారి ప్రణిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా జిల్లా విద్యాధికారి ప్రణిత మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు ప్రతి పాఠ్యాంశంలొని అంశాన్ని అర్థం చేసుకొని, సొంతంగా వ్రాసే విధంగా తయారు కావాలని అన్నారు. విషయంపై విశ్లేషణ శక్తి పెంపొందించు కొవాలని అన్నారు. చదవడంలో బట్టి విధానంతో ఉన్నది ఉన్నట్టు మాత్రమే వ్రాయగలరని అన్నారు. బట్టి విధానం స్వస్తి పలకాలని అన్నారు. ఆమె వెంట సెక్టోరియల్ అధికారి జేట్టి నారాయణ, ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్టే, జ్యోతి, వసుధ, మంజుష, సంతోష్, నాందేవ్, దేవదాస్, కృష్ణ మూర్తి, తదితరులు ఉన్నారు.