Prajaseva Bhavan: కంది శ్రీ‌నివాసరెడ్డి ప్ర‌జాసేవా భ‌వ‌న్‌లో సంబ‌రాలు

సిరా న్యూస్, ఆదిలాబాద్:

కంది శ్రీ‌నివాసరెడ్డి ప్ర‌జాసేవా భ‌వ‌న్‌లో సంబ‌రాలు

– మ‌రో రెండు గ్యారంటీల అమ‌లుపై హ‌ర్షం 

– కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలకు పాలాభిషేకం

కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇదివరకే రెండు గ్యారంటీలను అమలుచేస్తుండగా, మరో రెండు గ్యారంటీల‌ను అమ‌లుకు ఆదివారం శ్రీ‌కారం చుట్ట‌డంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని కంది శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌జాసేవా భ‌వ‌న్‌లో ఏఐసీసీ అగ్ర‌నేత‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ సంద్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ… ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్క గ్యారెంటీని అమలు పక్కాగా అమలు చేసేందుకు కార్యచరణ రూపొందిస్తోందని అన్నారు. తాజాగా గృహజ్యోతి పథకం కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల‌ వరకు ఉచిత విద్యుత్ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తూ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి-వెంకట్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్‌, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగెల‌ నర్సింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, మైనారిటీ నాయకులు ఎం.ఏ షకీల్, కిజర్ పాషా, మ‌హమ్మద్ రఫీక్, సయ్యద్ షాహిద్ అలీ, గణపత్ రెడ్డి, మునిగెల‌ విట్టల్, నిమ్మల ప్రభాకర్, లింగన్న, కోరేటి కిషన్, రాజ్ మ‌హ‌మ్మ‌ద్‌, కొండూరి రవి, మానే శంకర్, కందుల సుకేందర్, తుమ్మ ప్రకాష్, చారి, శ్రీరామ్, సయ్యద్ సుజాత్ అలీ, ఖలీం, సమీ ఉల్లా ఖాన్, అబ్దుల్ రషీద్, నదీమ్, ఎం.ఏ ముఖీమ్, తలా చౌష్, అతిక్, చంటి, శంకర్, జగదీష్ రెడ్డి, రామన్న, అశోక్, షాదబ్, కర్మ, తైమూర్,లత, లక్ష్మి, నల్వాల సుమ, సోని, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *