Lakshman Rao: పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

సిరా న్యూస్, చిగురుమామిడి
పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
* ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు
* ప‌దో తరగతి విద్యార్థుల వీడ్కోలు
ఈ సారి పదవ తరగతి వార్షిక పరీక్షల్లో అందరూ ఉత్తమ ఫలితాలను సాధించి అటు పాఠశాలకు, ఇటు ఉపాధ్యాయులకు, త‌ల్లిదండ్రుల‌కు మంచి పేరు తేవాలని ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు అన్నారు. బుధ‌వారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలోనీ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 2023-2024 సంవత్సరాపు పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈసంద‌ర్భంగా 9వ తరగతి విద్యార్థులు.. పదవ తరగతి వారికి వీడ్కోలు ఇచ్చారు.
అనంత‌రం ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు మాట్లాడుతూ పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు,గ్రామానికి మంచిపేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చి జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు కనుగాంటి రాజమౌళి, శ్యామల ,జోష్ణ, శంకర్ ప్రతిమ, బీజేపీ యువ నాయకుడు బండి సందీప్,విద్యార్థుల తల్లిదండ్రులు యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *