సిరాన్యూస్, ఆదిలాబాద్
అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యార్థిని మృతి
* ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
* రిమ్స్ ప్రధాన రహదారి ఎదుట రాస్తారోకో
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మామిడిగూడ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఏడవ తరగతి విద్యార్థిని మహేశ్వరి అనారోగ్యంతో రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆశ్రమ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని మృతి చెందిందని ఆరోపిస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక రిమ్స్ ప్రధాన రహదారి ఎదుట రాస్తారోకో చేపట్టారు.ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వహించిన హెడ్ మాస్టర్, ఏటిడిఓ లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.