ED Shankar: పర్యావరణానికి విఘాతం క‌లిగిస్తే చ‌ర్య‌లు

సిరాన్యూస్, బేల‌
పర్యావరణానికి విఘాతం క‌లిగిస్తే చ‌ర్య‌లు
* ప్లాస్టిక్ తో పర్యావరణానికి ముప్పు
* ఎస్సి కార్పొరేషన్ ఈడీ శంకర్
* సంతలో అధికారుల అవగాహన
పర్యావరణానికి విఘాతం క‌లిగిస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సాంగిడి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎస్సి కార్పొరేషన్ ఈడీ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎస్సి కార్పొరేషన్ ఈడీ శంకర్ వారాంతపు సంతతో పాటు కిరాణా షాపు వాళ్లకు పర్యావరణంపై అవగాహన కల్పిచారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్లాస్టిక్ వాడి పర్యావరణానికి ఎవరైనా విఘాతం కల్పిస్తే 1000 జరిమానాతో పాటు కిరాణా షాపు వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మీలింద్.రమాకాంత్.లస్మారెడ్డి పంచాయతీ కార్యదర్శి గౌతమ్ ఎంపీటీసీ రాకేష్ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *