సిరాన్యూస్, ఆదిలాబాద్
నిరంతరం విద్యుత్ కల్పించాలి
* జిల్లా పాలనాధికారి రాహుల్ రాజ్
* ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ
నిరంతరం విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా పాలనాధికారి రాహుల్ రాజ్ సూచించారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమైన సందర్భంగా స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల (బాలురు) ను జిల్లా పాలనాధికారి రాహూల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు .ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాలను పరిశీలించి, విద్యార్ధుల హాజరు, సిసి కెమెరా, విద్యార్ధులకు కల్పించిన సౌకర్యాల పై ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు.
ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సరం పరీక్షలు వ్రాస్తున్న 10,424 మందికి గాను 9690మంది పరీక్షలకు హాజరయ్యారని, 734 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. కలెక్టర్ వెంట ఇంటర్మీడియట్ అధికారి రవిందర్, ప్రిన్సిపల్, తదితరులు ఉన్నారు.