సిరాన్యూస్, కుందుర్పి
ఘనంగా జాతీయ సైన్స్ డే
* విద్యార్థులకు బహుమతులు ప్రదానం
కంబదూరు మండల పరిధిలోని తిమ్మాపురం జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులు నాన్ టీచింగ్ స్టాఫ్ జాతీయ సైన్స్ డే ను జరుపుకున్నారు. విద్యార్థులు సైన్స్ డే సందర్భంగా సోలార్ మిక్సీ, చంద్రయాన్ రాకెట్, ఉప్పునీటి మంచినీరుగా మార్చడం, ప్లాంట్ సెల్, ప్లాంట్అనిమల్, సెల్, బ్యాక్టీరియా వంటి ప్రయోగాలు విద్యార్థులు చేశారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు.