సిరా న్యూస్, జైనథ్:
29న బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా…
సోయాబీన్, శనగ పంటలను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లించి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 29న (గురువారం) ఉదయం 10.00 గంటలకు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని అంతర్ రాష్ట్రీయ రహదారిపై రైతు ధర్నా నిర్వించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు.