పెద్దలసభ ఎన్నికలలో ట్విస్టులు

సిరా న్యూస్;
దేశాన్ని పదేళ్లుగా బీజేపీ పాలిస్తోంది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఉన్నా 2014, 2019 ఎన్నికల తర్వాత మిత్ర పక్షాలతో కలిసి ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగుతోంది. ఎన్నిక‌ల్లో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కానీ.. ఇది ఫ‌క్తు.. ఒత్తిళ్లు, స్వ‌లాభాలు, బుజ్జ‌గింపుల‌తో నిండిపోవ‌డంతో పెద్దల స‌భ ఎన్నిక‌ల‌పై పెద్ద మ‌చ్చే వేసేసింది. తాజాగా రాజ్య‌స‌భకు ఏక‌గ్రీవాలు కాని మూడు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌లు నిర్వ‌హించింది దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అయినప్పటికీ రాజ్యసభలో ఇప్పటికీ పూర్తి స్థాయి బలం లేదు. ఏదైనా చట్టం ఆమోదం పొందాలంటే బీజేపీ, ఎన్డీఏ పార్టీలే కాకుండా ఎన్డీఏ కూటమి బయటి పార్టీ సభ్యులు కూడా మద్దతు తెలిపితేనే జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ భారీగా రాజ్యసభ స్థానాలు దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాజ్యసభలో ఏ పార్టీకి ఎంత మద్దతు ఉంది.క్రాస్ ఓటింగ్, ఇండిపెండెంట్‌ల మద్దతు, ఆయా రాష్ట్రాల్లో సంచలన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంగళవారం 3 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. అయితే మొత్తం ఖాళీ కానున్న 56 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. 41 సీట్లు ఏకగ్రీవం కాగా.. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 15 స్థానాలకు ఎన్నికలు త్త‌ర‌ప్ర‌దేశ్‌. ఇక్క‌డ అత్య‌ధికంగా 10 రాజ్య‌స‌భ సీట్ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించారు. అయితే.. పోరు హోరాహోరీగానే ఉంటుంద‌ని అంచ‌నా వేసిన‌ట్టే అలానే జ‌రిగింది. కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. బీజేపీ కి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ వేయ‌డంతో ఇక్క‌డ అంచ‌నా త‌ప్పిపోయింది. దీంతో బీజేపీకి ఎమ్మెల్యేల సంఖ్యాప‌రంగా ద‌క్కాల్సిన స్థానాలకంటే.. కూడా ఒక‌టి ఎక్కువ‌గా క‌లిసివ‌చ్చింది. ఇక్క‌డి మొత్తం 10 స్థానాల్లో బీజేపీ ఎనిమిది(8) స్థానాల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం స‌మాజ్ వాదీ పార్టీ మూడు స్థానాలు గెలుచుకునే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. బీజేపీ ప్ర‌లోభాలు పెట్టింద‌నే వాద‌న వినిపించింది. దీనికి త‌గ్గ‌ట్టుగానే.. ఇక్క‌డ ఎస్పీ కేవ‌లం రెండు స్థానాల విజ‌యంతో స‌రిపెట్టుకుంది. ఇక‌, కాంగ్రెస్ పార్టీ మ‌రో స్థానం ద‌క్కించుకుంది. మొత్తంగా బీజేపీదే పైచేయిగా సాగింది. త‌మ బ‌లానికి మించి బీజేపీ మ‌రోఅభ్య‌ర్థిని నిల‌బెట్ట‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. క్రాస్ ఓటింగును ప్రోత్స‌హించ‌డం ద్వారా త‌న బ‌లానికి మించి మ‌రో స్థానాన్ని క‌మ‌ల నాథులు రాబ‌ట్టారు. ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ విజ‌యాన్ని ఊహించ‌ని సీట్ల‌ను ద‌క్కించుకున్న కాంగ్రెస్ పార్టీ క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ వ్యూహానికి అడ్డుక‌ట్ట వేయ‌లేక పోయింది. దీంతో బీజేపీ ఒక సీటును ఇక్క‌డ కైవ‌సం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలను ద‌క్కించుకోగా, నాలుగో స్థానం కోసం బరిలోకి దిగిన బీజేపీ-జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థి ఓటమిపాలయ్యారు. మొత్తంగా చూస్తే.. నాలుగు స్థానాలు ద‌క్కించుకునే అవ‌కాశాన్ని ఇక్క‌డ కాంగ్రెస్ వ‌దులుకున్న‌ట్టు అయింది. ఉత్త‌రాదికి-ఈశాన్యానికి అటు ఇటు ఉండే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఒకే ఒక్క రాజ్య‌స‌భ స్థానానికి ఎన్నిక‌ జ‌రిగినా.. తీవ్ర ఉత్కంఠ మాత్రం కొన‌సాగింది. వాస్త‌వానికి ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వ‌మే ఉంది. అయిన‌ప్ప‌టికీ.. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌పై ప‌ట్టు కోల్పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. అసెంబ్లీ బ‌లాబలాల‌ను చూస్తే.. కాంగ్రెస్‌కు 45 మంది, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు ఇండిపెండెంట్లు ఉన్నారు. దీంతో కాంగ్రెస్ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగి ఉంటే.. ఫ‌లితం అనుకూలంగా వ‌చ్చేది. కానీ, ముందు నుంచి అతిధీమా వ్యక్తం చేయ‌డంతో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ కు, ఆయ‌న‌కు సమానంగా చెరో 34 ఓట్లు వచ్చాయి. దీంతో డ్రా తీయగా విజయం మహాజన్ ను వరించింది. కాంగ్రెస్ ఎమ్మెల్మేలు ముగ్గురు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో త‌న సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ ప‌ట్టు నిలుపుకోలేక పోయింది. అయితే ఏకగ్రీవం అయిన 41 స్థానాల్లో 30 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఇక 15 స్థానాల్లో బీజేపీ 10, కాంగ్రెస్ 3, సమాజ్‌వాదీ పార్టీ 2 సీట్లు సాధించాయి. ఇక హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఎస్పీ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతుగా క్రాస్ ఓటింగ్ వేశారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా బీజేపీ నేతలు ఓటు వేయడం సంచలనంగా మారింది. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికలు ఏకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్నే కూల్చే స్థాయికి చేరుకున్నాయి.రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 240. మెజారిటీ దక్కించుకోవాలంటే 121 మంది సభ్యులు అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *