BRS Party: కదం తొక్కిన గులాబీ దండు…

సిరా న్యూస్, జైనథ్:

కదం తొక్కిన గులాబీ దండు…

+ జైనథ్ జాతీయ రహదారిపై రాస్తారోకో

+ మద్దతు ధరతో పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్

+ రెండు గంటల పాటు భారీ ట్రాఫిక్ జామ్

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రం గుండా వెళ్లే జాతీయ రహదారిపై బిఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులు పండించిన సోయా, శనగ పంటలను మద్దతు ధరతో మార్కెట్లో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారిపై బైఠాయించి, సుమారు రెండు గంటల పాటు నిరసనలతో హోరెత్తించారు. దీంతో ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇటీవలే జైనథ్ లో సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభించి, కేవలం ఒక్క రోజుకే కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేయడంతో వారు మండిపడ్డారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం రైతుల ఇండ్లకు వెళ్లి పంటలు కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతుబంధు, రుణమాఫీలను వెంటనే అమలు చేయడంతో పాటు సోయా, శనగ పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రెండు మూడు రోజుల్లో అధికారుల నుండి పంటలు కొనుగోలు విషయంలో స్పష్టమైన హామీ రాకపోతే నిరసనలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సర్సన్ లింగారెడ్డి, రౌత్ మనోహర్, మెట్టు ప్రహ్లాద్, సావాపురే విజయ్ కుమార్, గణేష్ యాదవ్, గంభీర్ ఠాక్రే, మద్దుల ఊషన్న, కోల భోజన్న, కుంచెట్టి కేశవ్, నిమ్మల రమేష్ రెడ్డి, రోకండ్ల రమేష్ రావు, నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *