సిరా న్యూస్,శ్రీశైలం;
నంద్యాల జిల్లా శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ,పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 5 కోట్ల 62 లక్షల 30 వేల 472 రూపాయల నగదు రాబడిగా లభించగా ఈ ఆదాయాన్ని గత 49 రోజులలో శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణమ్మ తెలిపారు. ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటుగా 398 గ్రాముల 800 మిల్లీ గ్రాముల బంగారం,7 కేజీల 950 గ్రాముల వెండి లభించాయి. పైవాటితో పాటు ఈ హుండీ లెక్కింపులో పలు రకాల విదేశీ కరెన్సీ కూడా లెక్కించారు అందులో యుఎస్ఏ డాలర్లు 1989,ఆస్ట్రేలియా డాలర్లు 30, కెనడా డాలర్లు 305, ఇంగ్లాండ్ ఫౌండ్స్ 25, యూ ఏ ఈ ధీరంస్ 30, సింగపూర్ డాలర్లు 56, యూరోస్ 60, కువైట్ దినార్ 10, కత్తర్ రియాల్స్ 15 మొదలైన వివిధ విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణమ్మ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు అధికారులు,సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారు…